Tag Archive

ఆశువులు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం

By భైరవభట్ల దేవీప్రకాశ్

ఆశువులు 1. శ్రీ పి. వి. నరసింహరాజు – శతావధానాన్ని శతపత్ర సుందరిగా పోలుస్తూ అరయన్ పృచ్ఛకపత్రముల్ విరియ నవ్యంబైన యూహల్ మదిన్ పరమానందము గూర్చు బాలరవియై పద్యమ్ములే తేనెలై సరసుల్ ప్రేక్షకులెల్ల బంభరములై సాగంగ నీ యజ్ఞమే అరవిందాసన బ్రోచుగావుత శతంబానందమై అందమై 2. డా|| వై. బాబూరావు – అమరజీవి ఆత్మవేదన మేమొక జాతి మాది యుపమింపగలేని రసార్ద్రభాష ఏ స్వామికి కాళ్ళుబట్టుటకు స్వాంతము లొప్పవు మాకటంచు శ్రీ రాముడ గాంధిశిష్యుడను రాష్ట్రముకై బలియైతి నేను నే డేమిది గోతిలో పడియె యింత సమైక్యము కాలిపోవుచున్! 3. శ్రీమతి... »

వర్ణనలు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం

By భైరవభట్ల దేవీప్రకాశ్

వర్ణనలు 1. శ్రీమతి గుమ్మా చంపావతి –  సీతారాముల కల్యాణోత్సవం వశిష్ఠవిశ్వామిత్రుల ఆనందం. చంపకమాలలో. కలకల నవ్వు మైథిలి ముఖంబును జూచుచు రామచంద్రుడున్ గలగల స్వామి నవ్వుల నెగాదిగ జూచుచు లోకమాతయున్ తలిరుల జేతులందున సుధామయ ముక్తములట్లె యుంచ దో సిలి గని నవ్వి పల్కెను వశిష్ఠుడు శిష్ట మహార్ష ధర్మముల్ 2.  శ్రీ జి. రామయ్య రెడ్డి –  సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వైభవం, విడిపోతే విషాదం కలిసి బ్రతికియున్నన్ కల్పవృక్షంపు నీడన్ తెలుగుజనని నిల్చున్ తీపికైతల్ విదల్చున్ కలతల విడివడన్ కర్మముల్ కాలిపోవున్ తెలుగువెలుగు లారున్ తీవ్రవాదాలు రేగన్ 3.... »

దత్తపది -అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం

By భైరవభట్ల దేవీప్రకాశ్

దత్తపదులు 1. శ్రీమతి బి. హెచ్. దేవీ ప్రకాష్ – వారాయి, నానుని, వందె, నినవు – భారతార్థంలో వారా యీ భువి నేలువారు! సతులన్ వస్త్రంబులే యూడ్చు వా రా రాజున్ మురపించినాను నిజ ధైర్యాగారమున్ దాచినా నా రారాజు శిరమ్ము తన్నుటకు ఖాయంబూరువందే గదన్ బోరింతున్ పరమాత్మసాక్షి యని నవ్వున్ భీముడత్యుగ్రతన్ 2. శ్రీమతి పంతుల జయమహేశ్వరి – ఘనము, మనము, ధనము, జనము – భాగవతార్థంలో శుకుని మహాప్రబోధనము సూనృత వృక్షము లోకరక్షకై నికరము జేసి నీ మనము నీరజనేత్రునియందు నిల్పు దీ పిక... »

సమస్యలు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన , విజయనగరం

By భైరవభట్ల దేవీప్రకాశ్

విజయభావన సాహితీమిత్ర సమాఖ్య, విజయనగరం వారి ఆధ్వర్యంలో 25,26,27 డిసెంబర్ 2009 తేదీలలో మహాసహస్రావధాని, అవధాన చక్రవర్తి శ్రీ గరికపాటి నరసింహారావుగారు నిర్వహించిన శతావధాన సాహితీక్రతువు లో సమస్యాపూరణ పద్యాలు. సమస్యలు 1. అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వరశర్మ - మేరీమాత సుతుండు రాముడనియెన్ మేకొంచు సౌమిత్రియే ఏ రాజన్యునికైన స్వీయ జననీ హ్రీరమ్యమౌ నంకమే చేరన్ గోరెడు చోటుకాదె విపినశ్రీ కేగుచో ముందుగా చేరున్ దల్లి నటంచు దానిగని ఆర్చెన్ “వేడగా వచ్చి నా మేరీ? మాత, సుతుండు రాము” డనియెన్ మేకొంచు సౌమిత్రియే 2. శ్రీ... »

Loading